గత ఏడాది బాయీ దూజ్ పండుగ సందర్భంగా మహేష్ కూతురు సితార తన అన్నకి హారతి ఇచ్చి మంచి గిఫ్ట్ ఇచ్చింది. ఈ ఏడాది కూడా నమ్రత సమక్షంలో బాయీ దూజ్ పండుగ వేడుక మహేష్ ఇంట్లో ఘనంగా జరిగింది. సితా పాప గౌతమ్కి బొట్టు పెట్టి హారతి ఇచ్చి మరీ సెలబ్రేషన్స్ జరుపుకుంది. వేడుకకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కార్తీక మాసంలో జరిగే బాయీ దూజ్ ఫెస్టివల్ని హిందువులు ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగ రోజు సోదరీమణులు తమ సోదరులకి హారతి ఇచ్చి నిండు నూరేళ్ళు సుఖంగా ఉండాలని కోరుకుంటారు. అంతేకాదు ఆ రోజు తమ సోదరునికి గిఫ్ట్లు కూడా ఇస్తారు. రాఖీ పండుగ మాదిరిగానే ఈ పండుగ వేడుకని జరుపుకుంటారు.
Happy and cute celebrations of #BhaiyaDooj #SitaraPapa #Gautam #NamrataShirodkar #MaheshBabu pic.twitter.com/p6CfCab0Hm
— Venkatesh V (@venkatesh_et) October 29, 2019