ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన జిల్లా హనుమాన్ జంక్షన్లో చోటుచేసుకుంది. అతి వేగంగా వచ్చిన కారు ఆటోను ఢీకొనడంతో అందులోని ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఇద్దరిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
previous post
మొన్నటి వరకు మోదీతో..ఇప్పుడు రాహుల్ జపం