ఈ ఏడాది ఐపీఎల్లో ఆడే అవకాశం రాకపోవడంతో ఈ సమయాన్ని హనుమ విహారి మరోరకంగా సద్వినియోగం చేసుకోవాలనుకున్నాడు. టీమిండియా టెస్టు స్పెషలిస్టు హనుమ విహారి ఇంగ్లిష్ కౌంటీల్లో ఆడబోతున్నాడు. రాబోయే ఇంగ్లండ్ పర్యటన కోసం విహారి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టాలనుకున్నాడు. ఈ క్రమంలోనే వార్విక్షైర్ క్లబ్ తరఫున విహారి బరిలోకి దిగనున్నాడు. ఇప్పటికే బ్రిటన్ చేరుకున్న విహారి.. ఈ సీజన్లో వార్విక్షైర్ తరఫున కనీసం మూడు మ్యాచ్లు ఆడనున్నాడు. ఈ విషయాన్ని వార్విక్షైర్ ప్రకటించకపోయినా.. బీసీసీఐ ఖరారు చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ ముగిశాక భారత క్రికెట్ జట్టు జూన్లో ఇంగ్లండ్కు వెళ్లి వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్… ఆ తర్వాత ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. 2019లో చివరిగా ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఐపీఎల్లో ఆడిన విహారి.. ఆ తర్వాత వేలంలో అమ్ముడుపోలేదు.