రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ప్రకటనపై బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఒక్కటే ఉంటే అమరావతి రాజధాని ఎలా అవుతుందని ప్రశ్నించారు. రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించడానికి ఇదేం కుటుంబ వ్యవహారం కాదని జీవీఎల్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాలని కొందరు చేస్తున్న వాదన సరికాదని చెప్పారు.రాజధాని విషయంలో అక్రమాలు జరిగాయని చెబుతోన్న వైసీపీ ప్రభుత్వం… మరి విచారణ ఎందుకు చేయించట్లేదని జీవీఎల్ నిలదీశారు. స్వార్థ ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తున్నారని మండిపడ్డారు. రాజధాని విషయంపై జనసేన పార్టీతో కలిసి త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు.