ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో మణిపురం బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ఓ మహిళ యత్నించింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా…ఆత్మహత్యాయత్నం చేసిన ఓ మహిళను కాపాడి మానవత్వం చాటుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే..
గుంటూరు జిల్లాలోని శ్రీనివాసరావుపేటకు చెందిన ఓ వివాహిత కుటుంబ కలహాలతో మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో మణిపురం ఫ్లై ఓవర్ పై నుంచి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. స్థానికులు ఎంత సర్దిచెప్పినా ఆమె పట్టించుకోకుండా బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది.
అయితే అటుగా ఇంటికి వెళ్తున్న ఎమ్మెల్యే ముస్తాఫా సదరు మహిళను గమనించి తన కారు ఆపి.. మహిళకు సర్ది చెప్పారు.. ఆ మహిళ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు..
అంతేకాకుండా తన కారులో ఎక్కించుకుని సదరు మహిళను తన ఇంటికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే.. ఆమె సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆమెకు తన ఫోన్ నంబరు ఇచ్చిన ఎమ్మెల్యే.. ఎప్పుడు ఫోన్ చేసినా సాయం చేస్తానని హామీ ఇచ్చారు.
జగన్ కేసులు… టీడీపీ పుంజుకుంటుంది… అంటూ ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు