*హైదరాబాద్ మాదాపూర్లో నిరూస్ సిగ్నల్ వద్ద గాంగ్వార్
*కాల్పుల్లో రౌడీ షీషర్ మృతి.. ఒకరికి గాయాలు
*ఇస్మాయిల్ పై ఆరు రౌండ్లు కాల్పులు
*రెండుగ్యాంగ్లు మధ్య రియల్ ఎస్టేట్ వార్
హైదరాబాద్ మాదాపూర్లో తెల్లవారుజామున కాల్పుల కలకలం రేగింది. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు.
ఇస్మాయిల్ అనే వ్యక్తిని సోమవారం తెల్లవారు మూడు గంటల సమయంలో ముజాహిద్ అనే వ్యక్తి తుపాకీతో కాల్చి చంపాడు. అతణ్ని కాపాడటానికి మధ్యలో వచ్చిన జహంగీర్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
ఇస్మాయిల్, జహంగీర్, మహ్మద్ మధ్య రియల్ ఎస్టేట్ వివాదమే కాల్పులకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
నిందితులు బైక్ పై వచ్చి కారులో ఉన్న ఇస్మాయిల్ పై పాయింట్ బ్లాంక్ లో ఆరు రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు.
ఇస్మాయిల్, జహంగీర్, మహ్మద్ అనే ముగ్గురు వ్యక్తుల మధ్య రియల్ ఎస్టేట్ వివాదం కొనసాగుతోంది. వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఇస్మాయిల్, జహంగీర్ లను మహ్మద్ నిరూస్ వద్దకు పిలిచాడు. వారి మధ్య కొద్ది సేపు చర్చలు జరిగాయి. ఈ క్రమంలో మహ్మద్ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఇస్మాయిల్ పక్కన ఉన్నవారిని భయపెట్టి చెదరగొట్టడానికి మరో ఆయుధంతో జిలానీ అనే వ్యక్తి కూడా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
తీవ్రంగా గాయపడిన ఇస్మాయిల్ ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను మరణించాడు. జహంగీర్ చికిత్స పొందుతున్నాడు.పరారీలో ఉన్న ముజాహిద్ బృందం కోసం గాలింపు చేపడుతున్నట్లు చెప్పారు.