భారత దేశంలో కాలుష్యం పెరిగి పోతూనే ఉంది. అయితే కాలుష్య నివారణలో భాగంగా పాతబడిన వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ విధించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సంతకం చేశారు.. కాలుష్య నివారణలో భాగంగా 8 సంవత్సరాల పైబడిన రవాణా వాహనాలకు 10 నుంచి 25 శాతం వరకు గ్రీన్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఫిట్నెస్ సర్టిఫికెట్ పునరుద్ధరణ సమయంలో ఈ ట్యాక్స్ వసూలు చేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అలాగే, 15 సంవత్సరాల కంటే పాత వ్యక్తిగత వాహనాలు కూడా గ్రీన్ ట్యాక్స్ పరిధిలోకి వస్తాయి. ఇక, ప్రభుత్వ ప్రజారవాణా వాహనాలపై మాత్రం కొంత తక్కువ మొత్తంలో పన్ను వసూలు చేయనుంది ప్రభుత్వం.. మరో విషయం ఏంటంటే.. కాలుష్య పూరిత నగరాల్లో గ్రీన్ ట్యాక్స్ ఏకంగా 50 శాతం వరకూ ఉండొచ్చని తెలుస్తోంది. వాహనం ఏ రకమైనది, ఎటువంటి ఇంధనం వినియోగిస్తోందనే అంశాల వారీగా కూడా పన్ను చెల్లింపుల్లో మార్పులు ఉండనున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
previous post
next post