telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

గ్రేటర్ ప్రచారానికి ఢిల్లీ పెద్దల రాకపై లక్ష్మణ్ క్లారిటీ…

amith shah bjp

గ్రేటర్ ఎన్నికలు తెలంగాణలో రాజకీయ వేడిని మరింతగా పెంచేశాయి. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం సాధించడంతో.. గ్రేటర్ ఎన్నికల్లోనూ మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. గ్రేటర్ ప్రచారానికి ఢిల్లీ పెద్దల రాకపై బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ క్లారిటీ ఇచ్చాడు. 27న ఉత్తరప్రదేశ్ సీఎం హైద్రాబాద్, చేవెళ్లలలో రోడ్ షో సభలలో పాల్గొంటారని, 28న జాతీయ అధ్యక్షుడు నడ్డా మేధావుల సభ, మల్కాజిగిరి పార్లమెంట్ లో రోడ్ షోలలో ప్రచారం చేస్తారని.. 29న అమిత్ షా సికింద్రాబాద్ రోడ్ షోలో పాల్గొంటారని లక్ష్మణ్ తెలియచేశారు. బీజేపీ దూకుడుతో, ఢిల్లీ పెద్దల రాకతో టీఆర్ఎస్‌ లో గుబులు మొదలైందనే ఊహాగానాలు కూడా సాగుతున్నాయి. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తిరుగులేకుండా ముందుకు సాగిపోయింది. ప్రచారంలోనూ, ఫలితాల్లోనూ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అయితే ఈసారి మాత్రం పరిస్థితులు అందుకు కాస్త భిన్నంగానే ఉన్నాయి. పలుచోట్ల టీఆర్ఎస్ నేతలు, అభ్యర్థులకు ఓటర్ల నుంచి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts