ఏపీ గవర్నర్ గా విశ్వభూషణ్ హరిచందన్ పదవీ బాధ్యతలను స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన తన తొలి అధికారిక పర్యటనను చేపట్టనున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం నేడు విశాఖపట్నం వెళ్లనున్నారు. బుధవారం గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన విశాఖ బయల్దేరుతారు.
ఈ మధ్యాహ్నం ఈస్టర్న్ నేవల్ హెడ్ క్వర్టర్స్ ను ఆయన సందర్శిస్తారు. సాయంత్రం కైలాసగిరి తెలుగు మ్యూజియం, వైయస్సార్ సెంట్రల్ పార్కును సందర్శిస్తారు.రేపు ఆంధ్ర యూనివర్శిటీలో జరిగే కార్యక్రమాల్లో హరిచందన్ పాల్గొంటారు. మధ్యాహ్నం పోర్టు ట్రస్టులో జరిగగే షిప్పింగ్, కార్గో కార్యకలాపాలను గవర్నర్ పరిశీలిస్తారు. అనంతరం రాత్రికి విజయవాడకు బయలుదేరుతారు.