telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

గొర్రెకుంట హత్యల కేసు : నిందితునికి ఉరి శిక్ష ఖరారు

సంచలనం సృష్టించిన వరంగల్ గొర్రెకుంట తొమ్మిది మంది హత్య కేసులో నిందుతుడు సంజయ్ కుమార్ యాదవ్ కు శిక్ష ఖరారు అయింది. ఈ కేసు లో ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది వరంగల్ అదనపు సెషన్స్ కోర్టు. మే 21న తొమ్మిది మందికి ఆహారంలో విషం కలిపి సజీవంగానే బావిలో పడేసిన సంజయ్..తెల్లారి వరుసగా మృతదేహాలను బయటకు తీశారు పోలీసులు. 25 రోజుల్లోనే చార్జీషీట్ దాఖలు చేసిన పోలీసులు..57మంది మంది వాంగ్మూలం నమోదు చేశారు పోలీసులు. ఒక హత్యను కప్పిపుచ్చుకునేందుకు తొమ్మిది మందిని దారుణంగా హత్య చేసిన నిందితుడు..కోర్టు తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా..బీహార్‌కు చెందిన సంజయ్‌కుమార్ తొమ్మిది మందికి కూల్‌డ్రింక్‌లో మత్తు మందు ఇచ్చి బావిలో పడేశాడు. రెండు నెలలుగా కనిపించకుండా పోయిన ఓ అమ్మాయి విషయంలో సంజయ్‌కుమార్‌ను మక్సూద్ కుటుంబం నిలదీసినందుకే ఈ హత్యలు చేసినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. అయితే ఈ కేసు తుది తీర్పు ఇవాళ వెలువడనుంది. ఆ నిందితునికి మరణ శిక్ష విధిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.

Related posts