telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

గోరంట్ల నామినేషన్ కు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌!

orantala root clear field nominatio Hindupur

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ హిందూపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగనున్న మాజీ పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ నామినేషన్‌ కు రూట్ క్లియర్ అయ్యింది. గోరంట్ల మాధవ్‌ నామినేషన్‌కు ఏపీ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం వేసిన స్టేపిటిషన్‌ను నిరాకరించిన హైకోర్టు గోరంట్ల నామినేషన్‌ వేసుకోవచ్చునని హైకోర్టు స్పష్టం చేసింది. రెండు చార్జ్ మెమోలు పెండింగ్‌లో ఉన్నందునే మాధవ్ వీఆర్ఎస్‌కు ఆమోదం తెలపలేదని ఏపీ పోలీస్ శాఖ న్యాయస్థానానికి నివేదించారు.

ఇరు పక్షాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు ప్రభుత్వం వేసిన స్టే పిటీషన్ ను తిరస్కరించింది.అయితే అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ ఆదేశాలకు మద్దతిస్తూ నామినేషన్ దాఖలు చేసుకోవచ్చునని స్పష్టం చేసింది. దీంతో గోరంట్ల మాధవ్ ఊపిరి పీల్చుకున్నారు. ఇకపోతే సోమవారం గోరంట్ల మాధవ్, ఆయన భార్య సవితలు హిందూపురం పార్లమెంట్ అభ్యర్థులుగా వైసీపీ తరపున నామినేషన్ దాఖలు చేశారు.

Related posts