telugu navyamedia
సినిమా వార్తలు

రాజస్థాన్ లో గోపీచంద్ షూటింగ్

rashi-khanna-and-gopichand
గత కొంతకాలంగా టాలీవుడ్ హీరో గోపీచంద్ కు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. సక్సెస్ ఆయనతో దాగుడుమూతలు ఆడుతోంది. ఎంత ప్రయత్నించినా కూడా సినిమాలు విభిన్నమైన టాక్ ను సొంతం చేసుకుంటున్నాయే తప్ప హిట్ అనే మాటేలేదు. యాక్షన్ సినిమాలు చేసినా, కుటుంబ కథా చిత్రాలు చేసినా ఫలితం ఒకటే కావడంతో గోపీచంద్ సక్సెస్ ఫుల్ హీరోల జాబితాలో ఇంకా వెనకబడే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గోపీచంద్ బాగా ఆలోచింది ఆయన మరో కథను ఎంచుకున్నాడు. తమిళ దర్శకుడు ‘తిరు’ వినిపించిన కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అనిల్ సుంకర నిర్మించబోయే ఈ సినిమాలో రాశి ఖన్నా నటించనుందనే వార్తలు విన్పించాయి. 
ఇంకా టైటిల్ ను ఖరారు చేయని ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను రాజస్థాన్ లో ప్రారంభించనున్నారు. ఈ నెల 21 నుంచి 45 రోజుల పాటు ఈ సినిమా రాజస్థాన్ లో చిత్రీకరణ జరుపుకోనుంది. చిత్రంలోని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తారట. 2019 ఆరంభంలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టి త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవడానికి సన్నాహాలు చేస్తున్నారట. మరి ఈ సినిమాతోనైనా గోపీచంద్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.

Related posts