telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వరద బాధితులకు గుడ్ న్యూస్…

హైదరాబాద్ నగరంలో సహాయ పునరావాస కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నగరంలో జరుగుతున్న సహాయ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో ఇవాళ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ అరవింద్ కుమార్, జిహెచ్ఎంసి కమిషనర్ శ్రీ లోకేశ్ కుమార్, ఎంఎయుడి కమిషనర్ శ్రీ సత్యానారాయణ రెడ్డి, వాటర్ వర్క్స్ ఇడి శ్రీ సత్యనారాయణ, ఎస్.పి.డి.సి.ఎల్. సిఎండి శ్రీ రఘుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

‘‘భారీ వర్షాలు, వరదల వల్ల ఇండ్లలోకి నీరొచ్చి ఆహార పదార్ధాలు, దుస్తులు, చెద్దర్లు అన్నీ తడిసిపోయాయి. కనీసం వండుకుని తినే పరిస్థితుల్లో కూడా చాలా కుటుంబాలు లేవు. అందుకే వారికి తక్షణ సాయంగా ప్రతీ బాధిత కుటుంబానికి 10వేల చొప్పున సాయం అందించాలని నిర్ణయించాం. ఈ కార్యక్రమం ముమ్మరంగా సాగాలి. పండుగకు ముందే డబ్బులు అందింతే పేదలకు ఉపయోగంగా ఉంటుంది. అందుకే రోజుకు కనీసం లక్ష మందికి ఆర్థిక సాయం అందించేలా పనిచేయాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

Related posts