హైద్రాబాద్ శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే .. దోహా నుంచి వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఇద్దరు వ్యక్తుల వద్ద 600 గ్రాముల బంగారం లభించింది.
బంగారానికి సంబంధించి.. ఆధారాలు చూపించమని కస్టమ్స్ అధికారులు సదరు ప్రయాణికులను ప్రశ్నించారు. వారి వద్ద నుంచి సమాధానం రాలేదు. దీంతో, సదరు వ్యక్తులు బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారని ధృవీకరించుకున్న అధికారులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
పంజాబ్ తరహాలో కేంద్రం ధాన్యాన్ని సేకరించాలని తీర్మానం..