హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో 9.2 కిలోల బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి ఏకంగా 9.2 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంతో బంగారాన్ని ఆ ప్రయాణికుడు 4 ఇస్త్రీ పెట్టెల్లో బంగారం దాచి రవాణా చేస్తుండడాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. పట్టుబడిన బంగారం విలువ రూ.3.46 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
వైసీపీ రౌడీలు మరో అడుగు ముందుకేశారు: నారా లోకేశ్