telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

శంషాబాద్ ఎయిర్ పోర్టులో 9.2 కిలోల బంగారం పట్టివేత

gold and silver prices in markets

హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో 9.2 కిలోల బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి ఏకంగా 9.2 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంతో బంగారాన్ని ఆ ప్రయాణికుడు 4 ఇస్త్రీ పెట్టెల్లో బంగారం దాచి రవాణా చేస్తుండడాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. పట్టుబడిన బంగారం విలువ రూ.3.46 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Related posts