బంగారానికి ఉన్న డిమాండ్ మరేదానికి లేదు. బంగారం ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. ఎందుకంటే మనదేశంలో మహిళలు ఎక్కువగా బంగారం కొనడానికే ఇష్టపడతారు. కానీ మన దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. కరోనా టైంలో బంగారం ధరలు ఆమాంతం పెరిగాయి. అయితే… బులియన్ మార్కెట్లో మూడు రోజులుగా పెరిగిన బంగారం ధరలు తాజాగా మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరిగి రూ. 50,070 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 90 పెరిగి రూ. 45,900 పలుకుతోంది. బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండి ధర రూ.400 పెరిగి రూ. 72,000 వద్ద కొనసాగుతోంది.
previous post
next post