telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు

బ్యాడ్ న్యూస్ : పెరిగిన బంగారం ధరలు

gold

బంగారం ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్‌ మరేదానికి లేదు. ఎందుకంటే మనదేశంలో మహిళలు ఎక్కువగా బంగారం కొనడానికే ఇష్టపడతారు. కానీ మన దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. కరోనా టైంలో బంగారం ధరలు ఆమాంతం తగ్గాయి. అయితే… కానీ బులియన్‌ మార్కెట్‌లో వారం రోజులుగా పెరిగిన బంగారం ధరలు తాజాగా మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 270 పెరిగి రూ. 49,260 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 240 పెరిగి రూ. 45,250 పలుకుతోంది. బంగారం ధరలు పెరగ్గా.. వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. కిలో వెండి ధర రూ.76,800 వద్ద కొనసాగుతోంది.

Related posts