telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

మహిళలకు షాక్‌…మళ్లీ పెరిగిన బంగారం ధరలు

కరోనా వైరస్‌ విజృంభించిన తర్వాత బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే.. ఏకంగా 10 గ్రాముల బంగారం ధర రికార్ఢ్ స్థాయిలో రూ.50 వేలు దాటిపోయింది. మాములు ప్రజలైతే బంగారం అంటేనే భయపడేలా బంగారం రేట్లు పెరిగిపోయాయి. అయితే..నిన్న భారీగా తగ్గిన పసిడి ధరలకు మళ్ళీ బ్రేక్ పడింది. నిన్న రూ.370 తగ్గిన బంగారం ధర..ఇవాళ మరో రూ.370 పెరిగింది. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1370 పెరిగి రూ. 54,150 కు పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 పెరిగి రూ.49,650 వద్ద ముగిసింది. హైదరాబాద్ విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.370 పెరగడంతో రూ. 51,920కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 పెరగడంతో రూ.47,600 కు పలుకుతోంది. వెండి విషయానికి వస్తే…హైదరాబాద్ కిలో వెండి ధర రూ.700 తగ్గడంతో రూ.66,300కు చేరింది. నిన్న బంగారం ధర తగ్గితే…వెండి ధర పెరిగింది. కానీ ఇవాళ బంగారం ధర పెరిగితే..వెండి ధర పడిపోయింది.

Related posts