తెలుగు రాష్ర్టాల్లో కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతబడి ఈమధ్యే తెరుచుకున్నాయి. విద్యార్ధులు పరీక్షలు కూడా రాస్తున్నారు. అయితే విద్యార్ధులు ఎక్కువగా ఆన్ లైన్ పరీక్షలకే మొగ్గు చూపుతున్నారు
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖలోని గీతం విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం కరోనా కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆఫ్ లైన్ కాకుండా ఆన్లైన్లో ఎగ్జామ్ నిర్వహించాలని ఆందోళన చేపట్టారు .
వందలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఆందోళనలో పాల్గొనడంతో గీతం ప్రాంగణం మొత్తం గందరగోళం నెలకొంది. భోరున వర్షం కురుస్తున్నా విద్యార్దులు ఆందోళన కొనసాగించారు.