హైదరాబాద్ జీహెచ్ఎంసీలో విధులు నిర్వహిస్తున్న సెక్షన్ అధికారి అష్రఫ్ లంచం తీసుకుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. రూ. 15 వేలు లంచం తీసుకుంటుడగా ఏసీబీ అధికారులు రెడ్ హాండెడ్ గా పట్టుకున్నారు. భవనంపై అదనపు అంతస్తు నిర్మాణానికి ధర్మేందర్ అనే వ్యక్తి నుంచి రూ.20వేలు అష్రఫ్ డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. నిందితుడు అష్రఫ్ ఛార్మినార్ సర్కిల్ 9లో సెక్షన్ అధికారిగా పనిచేస్తున్నాడు. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్కు పడుతుంది : నారాయణ