telugu navyamedia
ఆంధ్ర వార్తలు

నాన్నతో నేనొక్కడినే ఉంటాను, మీరంతా బయటికెళ్లండి..

ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి కుమారుడు కృష్ణార్జున రెడ్డి మంగళవారం రాత్రి 11 గంటల తర్వాత నెల్లూరు నగరంలోని నివాసానికి చేరుకున్నారు. అమెరికా నుంచి నేరుగా ఆయన చెన్నై చేరుకుని అక్కడి నుంచి నెల్లూరుకు వచ్చారు.

అప్పటి వరకూ ప్రజల సందర్శనార్థం గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని ఆయన నివాసంలో బయట ఉంచారు. కుమారుడు వస్తున్నాడని తెలిసి, భౌతిక కాయాన్ని మంత్రి చాంబర్ లోకి తీసుకెళ్లి ఉంచారు.

Krishnarjun Reddy At His Father Gautham Reddy Dead Body | Gautham Reddy Son  Krishna Arjun Reddy: నాన్నతో నేనొక్కడినే ఉండాలి, మీరంతా బయటికెళ్లండి !  గౌతమ్ రెడ్డి కుమారుడు ...

తన తండ్రి భౌతిక కాయంతో తనను ఏకాంతంగా వదిలేసి అందరూ బయటికెళ్లాలని కృష్ణార్జునరెడ్డి కోరారు. తండ్రి గుండెలపై చేయితో నిమురుతూ కుమారుడు బోరున విలపించాడు. అప్పటి వరకూ ఉద్విగ్నంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా హృద్యంగా మారిపోయింది. కృష్ణార్జున రెడ్డిని చూస్తూ పట్టరాని దుఃఖంతో మేకపాటి కుటుంబం గుండెలవిసేలా రోధించింది.

ఈరోజు నెల్లూరు జిల్లాలోని ఉద‌య‌గిరిలో మధ్యాహ్నం 11గంటలకు గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జ‌ర‌గ‌నున్నాయి

Related posts