telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీలో చేరనున్న గంటా.. ముహూర్తం ఖరారు?

Ganta srinivas tdp

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈనెల 3న వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. గంటా చేరికకు సంబంధించి విశాఖ నార్త్ వైసీపీ ఇంచార్జ్ కేకే రాజుకు పార్టీ అధినాయకత్వం నుంచి సమాచారం వచ్చినట్టు చెపుతున్నారు.

ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీ గూటికి గంటా చేరనున్నారు. అయితే సాంకేతిక సమస్యలు ఎదురుకాకుండా చూసుకోవడానికి తన కుమారుడు రవితేజకు మాత్రమే వైసీపీ కండువా కప్పనున్నారు. సీనియర్‌ మహిళా నేత, మాజీమంత్రి గల్లా అరుణకుమారి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Related posts