ప్రముఖ తమిళ హీరో ధనుష్ హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో ‘గేమ్ ఆఫ్ త్రోన్స్’ హాలీవుడ్ నటుడు జేమ్స్ కాస్మో కీలకపాత్ర పోషించనున్నారని దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ తెలిపారు. ఆయన ‘బ్రెవ్హార్ట్’, ‘ట్రాయ్’, ‘ఎలిమినేటర్’, ‘వండర్ ఉమెన్’, తదితర హాలీవుడ్ చిత్రాల్లో నటించారు. ధనుష్ నటించనున్న 40వ చిత్రం కావడంతో ఇంకా పేరు పెట్టని ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్గా ‘డి40’ అని పిలుచుకుంటున్నారు. ధనుష్ సరసన మలయాళ ముద్దుగుమ్మ ఐశ్వర్య లక్ష్మి నటించనుంది. ప్రస్తుతం అమ్మడు విశాల్ నటిస్తున్న ‘యాక్షన్’ చిత్రంలో కథానాయికలలో ఒకరిగా నటిస్తోంది. వైనాట్ స్టూడియోస్, రిలైన్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చనున్నారురజనీకాంత్ నటించిన ‘పేట్టై’ చిత్రానికి ముందుగానే ధనుష్ నటించాల్సిన కొత్త చిత్రానికి కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించాల్సి ఉంది. అయితే రజనీ నుంచి పిలుపు రావడంతో ఆ చిత్రం అలాగే ఆగిపోయింది. ప్రస్తుతం ఆ చిత్ర షూటింగ్ లండన్లో ప్రారంభం కానుంది. భారత సంతతికి చెందిన గ్యాంగ్స్టర్కు ఐరోపా సంతతికి చెందిన గ్యాంగ్స్టర్కు మధ్య జరిగే పోటీ నేపథ్యంగా ఈ చిత్ర కథాంశం రూపుదిద్దుకున్నట్టు సమాచారం.
previous post
నీరే జీవనానికి ఆధారం… కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుతం: నాగార్జున