telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

2019 ప్రపంచ కప్ : .. భారత్ నిలకడగా.. గబ్బర్ అర్ధసెంచరీ ..

gabbar half century with australia match

నేటి ప్రపంచ కప్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో తలపడుతున్న టీమిండియా ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. ఆరంభం నుంచి ఆచితూచి ఆడుతూ 10 ఓవర్లకు 41 పరుగులే చేసింది. చెత్త బంతులను బౌండరీలు తరలిస్తూ నెమ్మదిగా వేగం పెంచుతున్నారు. స్టార్క్, కమిన్స్ బౌలింగ్‌ను ఈ జోడీ ధాటిగా ఎదుర్కొంది.

కౌల్టర్ నైల్, స్టాయినీస్ బౌలింగ్‌లో స్వేచ్చగా రన్స్ సాధిస్తున్నారు. శిఖర్ ధావన్ 52 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సాధించాడు. వన్డేల్లో ఆసీస్‌తో మ్యాచ్‌లో 2వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 20 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 111/0 పరుగులు చేసింది. ధావన్(51), రోహిత్(42) క్రీజులో ఉన్నారు.

Related posts