నేటి ప్రపంచ కప్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో తలపడుతున్న టీమిండియా ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. ఆరంభం నుంచి ఆచితూచి ఆడుతూ 10 ఓవర్లకు 41 పరుగులే చేసింది. చెత్త బంతులను బౌండరీలు తరలిస్తూ నెమ్మదిగా వేగం పెంచుతున్నారు. స్టార్క్, కమిన్స్ బౌలింగ్ను ఈ జోడీ ధాటిగా ఎదుర్కొంది.
కౌల్టర్ నైల్, స్టాయినీస్ బౌలింగ్లో స్వేచ్చగా రన్స్ సాధిస్తున్నారు. శిఖర్ ధావన్ 52 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో హిట్మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సాధించాడు. వన్డేల్లో ఆసీస్తో మ్యాచ్లో 2వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 20 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 111/0 పరుగులు చేసింది. ధావన్(51), రోహిత్(42) క్రీజులో ఉన్నారు.
అతడి చెంప పగలగొట్టి, షర్ట్ కాలర్ పట్టుకుని… మెహ్రీన్ కామెంట్స్