హైదరాబాద్ నగరంలో జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో టైలరింగ్ కోర్సుల్లో ఉచిత శిక్షణ తరగతులను నిర్వహించనున్నారు. ఆసక్తిగల మహిళలకు రెండు నెలల పాటు టైలరింగ్ కోర్సుల్లో శంషాబాద్ ఎయిర్పోర్టు క్యాంపస్లోని ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు వరలక్ష్మి ఫౌండేషన్ తెలిపింది. ఉచిత భోజన వసతి, శిక్షణతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. 18 ఏండ్లు నిండి, 5వ తరగతి ఆపై చదువుకున్న వారు అర్హులని, మరిన్ని వివరాలకు ఫోన్ : 94948 00102, 84668 16090లోగానీ, స్వయంగా గానీ సంప్రదించవచ్చన్నారు.
previous post