telugu navyamedia
క్రైమ్ వార్తలు

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..కారు అదుపుతప్పి స్పాట్‌లో నలుగురు మృతి

నిజామాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ప్రమాదం జరిగింది. ముప్కాల్‌ మండలం కొత్తపల్లి సమీపంలో వేగంగా వెళ్తున్న కారు టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ప్రమాద సమయంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు . మృతుల్లో ఇద్దరు చిన్నారులు సైతం ఉన్నారు. ప్రమాద సమయంలో కారులో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు.

హైదరాబాద్‌ నుంచి నిర్మల్‌కు వెళ్తుండగా దుర్ఘటన జరిగింది. మృతులంతా హైదరాబాద్‌కు చెందిన ఒకే కుటుంబంగా గుర్తించారు. ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు… విచారణ చేస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

 

Related posts