telugu navyamedia
క్రైమ్ వార్తలు

దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం…

దేశ‌రాజ‌ధాని దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఓల్డ్ సీమాపురిలో మూడంతస్తుల భవనంలో తెల్ల‌వారు జామున‌ ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు సజీవదహనమయ్యారు. మరి కొందరు గాయపడినట్లు తెలుస్తోంది. మృతులను హౌరీ లాల్, రీనా, అషు, రాధికగా గుర్తించారు.

Delhi: Police personnel present at the spot in Old Seemapuri after four person were found dead in the fire. (Photo via ANI)

వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా..? లేక మరేదైన కారణంగా జరిగిందా అనే విషయాన్ని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు ఏంటని తెలుసుకుంటున్నారు.

Delhi: Four Dead After Massive Fire Breaks Out In Three-Storey Building In  Seemapuri

Related posts