దేశరాజధాని దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఓల్డ్ సీమాపురిలో మూడంతస్తుల భవనంలో తెల్లవారు జామున ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు సజీవదహనమయ్యారు. మరి కొందరు గాయపడినట్లు తెలుస్తోంది. మృతులను హౌరీ లాల్, రీనా, అషు, రాధికగా గుర్తించారు.
వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా..? లేక మరేదైన కారణంగా జరిగిందా అనే విషయాన్ని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు ఏంటని తెలుసుకుంటున్నారు.
కమల్ అనుచిత వ్యాఖ్యల పై కేసు నమోదు