కాంగ్రెస్ పార్టీలో అగ్రకుల ఆధిపత్యం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ ముఖ్యమంత్రి అయిన రోజే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా 1990లో తనకు జరిగిన ఓ ఘటనను వీహెచ్ గుర్తు చేశారు. 1990లో తనకు ముఖ్యమంత్రి అవకాశం వచ్చినా బీసీ అని చెప్పి ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకున్నారనిచెప్పుకొచ్చారు.
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆయన ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నష్ట పరిహారం చెల్లించాలని సర్కార్ను డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన అధికారుల్ని కఠినంగా శిక్షించాలన్నారు. ఇంటర్మీడియట్ సెక్రటరీ అశోక్ను బర్త్రఫ్ చేసి..విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, బీసీ నేత ఆర్.కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.