telugu navyamedia
క్రైమ్ వార్తలు

పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో ప్రమాదం..ఐదుగురి కూలీలు దుర్మరణం

*పాలమూరు లిఫ్ట్ పనుల్లో‌ అపశ్రుతి
*ఐదుగురు కూలీలు దుర్మరణం
*కొల్లాపూర్ మండలం రేగుమనగడ్డ వద్ద ఘటన
*క్రేన్‌ సాయంతో పంపుహౌస్‌లోకి దిగుతుండగా ఘటన
*క్రేన్‌ వైరు తెగిపడి ఐదుగురు కార్మికులు మృతి
*మృతులు బిహార్‌ వాసులుగా గుర్తింపు

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. పంప్ హౌస్‌లోకి క్రేన్‌ సహాయంతో కార్మికులు లోపలికి దిగుతుండగా క్రేన్ వైర్ తెగిపోవడంతో ఐదుగురు కార్మికులు స్పాట్‌లో మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరొక కార్మికుడు తీవ్రంగా గాయపడటంతో అతడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం రేగమనగడ్డ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను బీహార్‌ నుంచి వచ్చిన వలస కూలీలుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన స్పాట్‌కి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాల్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు జరిగిన ప్రమాదంపై స్థానిక ఎమ్మెల్యే విచారం వ్యక్తం చేశారు.

Related posts