telugu navyamedia
క్రైమ్ వార్తలు

జమ్మూ కాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం : లోయలోకి దూసుకెళ్లిన ఎస్​యూవీ వాహ‌నం…

జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్‌యూవీ వాహనం అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లడంతో ఐదుగురు మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు.

ఎస్​యూవీ వాహనం పంజాబ్‌ నుంచి శ్రీనగర్‌కు వెళ్తుండగా మన్సార్ సమీపంలోని జమోదా సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.

ఆరుగురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న ఎస్​యూవీ వాహనం డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని, ఆ తర్వాత అది లోయలోకి పడిపోయిందని అధికారులు తెలిపారు. ఐదుగురి మృతదేహాలను వెలికితీసినట్లు చెప్పారు. క్షతగాత్రున్ని స్థానిక ఆసుపత్రికి తరలించామన్నారు.

ఐదు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, ఆరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని వారువెల్ల‌డించారు.

Related posts