ప్రకాశం జిల్లాలోని ఉలవపాడు ఎస్బీఐ (స్టేట్ బ్యాంకు) లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం ఉదయం కరెంట్ షార్ట్సర్క్యూట్తో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా ఎగసిపడడంతో ఫర్నిచర్, కంప్యూటర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.
అయితే బ్యాంకులోని గోల్డ్, ఫైల్స్ పరిస్థితేంటన్నది తెలియరాలేదు. ఈ అగ్నిప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
.
టీఆర్ఎస్ నేతలకు మతి భ్రమించింది: కిషన్ రెడ్డి