ఇవాళ తిరుపతిలో ఓట్ల లెక్కింపు కేంద్రంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతిలోని ఎస్వీ సెట్ ఇంజినీరింగ్ కాలేజిలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తుండగా మంటలు చెలరేగాయి. ఏసీ యంత్రంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. అగ్నిప్రమాదం జరగడంతో అక్కడున్న వారు వెంటనే స్పందించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు.
అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు రంగప్రవేశం చేసి మంటలను ఆర్పేశారు. ఇదే కాలేజీలో పోలింగ్ కు ముందురోజు కూడా అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో మానిటరింగ్ రూమ్ లోని ల్యాప్ టాప్ లు అగ్నికి ఆహుతయ్యాయి. మళ్లీ అదే కేంద్రంలో అగ్నిప్రమాదం జరగడం పట్ల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అందుకే టీడీపీని ప్రజలు ఇంటికి పంపించారు: మంత్రి బొత్స