*కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఆగ్ని ప్రమాదం..
*మంటల్లో చిక్కుకున్న ఐదేళ్ల బాలిక..
*మంటల్లో చనిపోయిందేమోనని అనుమానం వ్యక్తం..
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో అగ్ని ప్రమాదం జరిగింది. మష్రూమ్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో దాదాపు 2 వేల టన్నుల వరి గడ్డి దగ్ధమైంది. అయితే మునీరా అనే ఐదేళ్ళ చిన్నారి ప్రమాదంలో సజీవ దహనమైనట్లుగా తెలుస్తోంది.
పాప ఆచూకీ కోసం గడ్డి, బూడిదలో జేసీబీ సాయంతో గాలిస్తున్నారు. మూడు , ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. మంటల్లో చనిపోయిందేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.