ప్రపంచం మొత్తం ఐఫోన్ అంటే ఎంతో క్రేజ్.. యూత్తో పాటు అంతా.. కొత్త మోడల్ ఐఫోన్ మార్కెట్లోకి వచ్చిందంటే.. దానిని వీలైనంత తొందరగా సొంతం చేసుకోవాలని చూస్తుంటారు.. అయితే, ఐఫోన్స్ తయారీ సంస్థ… ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్కు భారీ జరిమానా తప్పలేదు… ఆ సంస్థ తప్పుడు వ్యాపార విధానాలను అనుసరించిందంటూ.. ఇటలీలోని యాంటీట్రస్ట్ అథారిటీ.. యాపిల్ సంస్థకు 10 మిలియన్ యూరోస్ (కోటి 20 లక్షల డాలర్లు) జరిమానాగా విధించింది. ఐఫోన్లకు సంబంధించిన తప్పుడు విధానాలే కారణమంటూ తన ప్రకటనలో పేర్కొంది ఇటలీ యాంటీట్రస్ట్ అథారిటీ. ఇటలీ యాంటీట్రస్ట్ అథారిటీ ప్రకటన ప్రకారం.. యాపిల్ సంస్థ విడుదల చేసిన పలు మోడళ్ల ఐఫోన్లపై ఎలాంటి వివరాలు ఇవ్వకుండా.. వాటర్ రెసిస్టెంట్లుగా ప్రచారం చేసిందని పేర్కొంది.. కంపెనీ డిస్క్లైమర్లో మాత్రం ద్రవ పదార్థాల నుంచి ఫోన్ దెబ్బ తింటే వారంటీ వర్తించదని పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.. అంతేకాదు.. నీటిలోపడి ఫోన్లు దెబ్బతిన్న వారికి సంస్థ ఎటువంటి సహకారం అందించలేదని కూడా పేర్కొన్నారని.. ఇది వినియోగదారులను మోసం చేయడమేనని యాంటీట్రస్ట్ అథారిటీ ఆరోపిస్తుంది.
previous post
next post