ఇటీవల కశ్మీర్ స్వయంప్రతిపత్తి విషయంలోకేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై బాలీవుడ్ డైరెక్టర్, నటుడు అనురాగ్ కశ్యప్ ట్విట్టర్లో తనదైన రీతిలో స్పందించారు. దీంతో కొందరు అనురాగ్ తల్లిదండ్రులకు, కుమార్తెను బెదిరించారు. అనురాగ్ కశ్యప్ సోషల్ మీడియాలో భాగమైన ట్విట్టర్ నుండి బయటకు వచ్చేశారు. ఆయన తన చివరి ట్వీట్లో తాను ట్విట్టర్ వీడిపోవడానికి గల కారణాన్ని వివరించారు. “మన తల్లిదండ్రులు, కుమార్తెకు ఫోన్లో బెదిరింపులు రావడం.. ఆన్ లైన్లో బెదిరింపులు వస్తే ఎవరూ మాట్లాడాలని అనుకోరు. బెదిరింపు దారుల పాలన, బెదిరింపులే ప్రస్తుతం మన దేశంలో కొత్త జీవన విధానం. సరికొత్త ఇండియాకు అభినందనలు. అందరూ మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఎలాంటి భయం లేకుండా నా మనసుని మాట్లాడించలేని నేను మాట్లాడలేను… గుడ్ బై.. ఇదే నా చివరి ట్వీట్” అంటూ అనురాగ్ కశ్యప్ ట్వీట్ ద్వారా తెలిపారు.
previous post