మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే కాలయముడైయ్యాడు. ఆడుకుంటున్న తన ఇద్దరి పిల్లలను తీసుకెళ్లి వ్యవపాయ బావిలో పడేసి హత్య చేశాడు ఓ కసాయి తండ్రి. ఈ సంఘటన మహబూబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామ శివారు గడ్డిగూడెంలో మంగళవారం చోటుచేసుకుంది.
వివర్లాలోకి వెళితే..
శిరిష, రామ్ కుమార్ ఇద్దరు దంపతులు. వీరికి జాక్సన్(8), జానిబేస్టో(6) పిల్లలు. పాఠశాలకు పండుగ సెలవులు కావడంతో పిల్లలు ఇద్దరూ ఇంటి వద్దనే ఉంటున్నారు. రామ్కుమార్ సీఎస్ఎఫ్ జవాన్గా ముంబైలో పనిచేస్తున్నాడు. ఇతను నాలుగు రోజుల క్రితమే ఇంటికి వచ్చాడు. రామ్కుమార్ తన భార్య బంగారాన్ని గతేడాది బ్యాంక్లో తాకట్టుపెట్టి డబ్బుతీసుకున్నాడు.
తాజాగా, ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. శిరిష తన బంగారాన్ని తీసుకురావాలని భర్తతో వాగ్వాదానికి దిగింది. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన రామ్కుమార్ భార్యపై చేయిచేసుకున్నాడు.
దీంతో రామ్కుమార్ భార్య… రాత్రి గడ్డిగూడెం తండాలోని పుట్టింటికి వెళ్లింది. ఉదయం పిల్లలను బైక్పై పొలం వద్దకు తీసుకెళ్లిన రామ్కుమార్… తన పొలంలోని బావిలో ఇద్దరు పిల్లలను తోసేశాడు.
ఆ తర్వాత గ్రామంలోకి వెళ్లి తన పిల్లలను బావిలో పడేసినట్లు తెలిపాడు. దీంతో గ్రామస్తులు వెంటనే బావి దగ్గరకు చేరుకుని, పిల్లలిద్దరిని బయటకు తీశారు. అప్పటికే పిల్లలిద్దరు మృత్యువాత పడ్డారు. దీంతో కన్నతల్లి గుండెలవిసేలా రోధిస్తుంది.. ఆ తండా వాసులు తల్లి బాధను చూసి తల్లడిల్లిపోతున్నారు..
కాగా..రామ్కుమార్ పారారిలో ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థాలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.