*అదిలాబాద్ జిల్లాలో పరువు హత్య
* కన్న తల్లి ఎదుటే యువతిని గొంతుకోసి చంపిన తండ్రి..
*మూడు నెలల క్రితం మతాంతర వివాహం చేసుకున్న రాజేశ్వరి..
*నార్నూర్ మండలం నాగల్ కొండలో ఘటన
అదిలాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వేరే మతానికి చెందిన యువకుడిని ప్రేమించి పెళ్ళి చేసుకున్న యువతిని కన్న తండ్రే గొంతుకోసి దారుణం హత్య చేశారు .ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం నాగల్కొండలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే..
మూడు నెలల క్రితం షేక్ ఆలీం అనే యువకుడిని రాజేశ్వరి ప్రేమించి పెళ్ళి చేసుకుంది. ఆ పెళ్ళి ఇష్టం లేని రాజేశ్వరిని తల్లిదండ్రలు రెండు వారాలు క్రితం ఊళ్లో పంచాయితీ పెట్టి యువతి ,యువకుడిని వీడగొట్టారు.
అయితే. .రాజేశ్వరి తల్లిదండ్రులతో ఉండనని, భర్తే కావాలని తల్లిదండ్రులతో రోజు గొడవ గొడవపడడంతో ..పరువుపోయిందని కన్న తల్లి ఎదుటే యువతిని తండ్రి గొంతుకోసి హతమార్చినట్లు సమాచారం.