telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

రెవెన్యూ సిబ్బందిపై పెట్రోల్ చల్లిన రైతు

New couples attack SR Nagar

భూమి పట్టా మంజూరు చేయట్లేదని ఓ రైతు ఆవేదనకు గురయ్యాడు. తహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్లి సిబ్బందిపై నకయ్య అనే రైతు పెట్రోల్ చల్లాడు. సీనియర్ అసిస్టెంట్ రామచందర్, వీఆర్వో అనిత, కంప్యూటర్ ఆపరేటర్ జగదీశ్, అటెండర్ దివ్యపై పెట్రోల్ పడింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకుంది.

ఈ విషయాన్ని జేసీ శ్యామ్ ప్రసాద్ లాల్.. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ దృష్టికి తీసుకెళ్లారు. కనకయ్యపై పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ కార్యాలయానికి చేరుకున్న పోలీసులు రైతు కనకయ్యను అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనంతో ఉలిక్కిపడ్డ రెవెన్యూ శాఖలో ఇటువంటి మరో ఘటన జరగడం విస్మయానికి గురి చేస్తోంది.

Related posts