telugu navyamedia
క్రీడలు వార్తలు

కోహ్లీ కారణంగానే ఓడిపోయాం అంటున్న అభిమానులు…

నిన్న మొతేరాలో ఇంగ్లాండ్ థ్ జరిగిన మూడో టీ20లో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ (77) హాఫ్ సెంచరీ చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్‌ 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. కానీ అనంతరం ఇంగ్లండ్‌ 18.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అయితే భారత ఇన్నింగ్స్ సమయంలో విరాట్ కోహ్లీ తప్పిదం కారణంగా.. దూకుడుగా ఆడుతున్న యువ ఆటగాడు రిషబ్ పంత్ (25) రనౌట్ అయ్యాడు. అయితే రనౌర్ సమయంలో అప్పటికే రెండు పరుగులు పూర్తి చేసిన బట్లర్ త్రో గురి తప్పడంతో మూడో పరుగు కోసం పంత్‌ని కోహ్లీ పిలిచాడు. కోహ్లీ-పంత్ మూడో పరుగుకి ట్రై చేయడంతో.. వేగంగా స్పందించిన బట్లర్.. బంతిని అందుకుని నేరుగా బౌలర్ కరన్‌కి అందించాడు. దాంతో బంతిని అందుకున్న కరన్ వికెట్లని కొట్టేసాడు. కరన్ రనౌట్ చేసే సమయానికి క్రీజుకి చాలా దూరంలో పంత్ ఉండిపోయాడు. రనౌట్ ప్రమాదం గ్రహించి డైవ్ చేసినా లాభం లేకపోయింది. దాంతో విరాట్ కోహ్లీ తొందరపాటు కారణంగా మంచి ఫామ్‌లో ఉన్న రిషబ్ పంత్‌ను రనౌట్ అయ్యాడు. దీంతో సోషల్ మీడియాలో కోహ్లీపై ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related posts