భారత్ నుంచి బంగ్లాదేశ్ లో బంగాళాఖాతంలో ఏర్పడిన ఫణి తుపాను ప్రవేశించింది. శుక్రవారం ఉదయమే ఒడిశా వద్ద తీరం దాటిన ఫణి, పశ్చిమ బెంగాల్ మీదుగా ఇవాళ బంగ్లాదేశ్ తీరాన్ని తాకింది. ప్రస్తుతం ఫణి తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. దీని కారణంగా బంగ్లాదేశ్ లో భారీ వర్షాలు, తీవ్రమైన గాలులు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి.
ఇప్పటివరకు బంగ్లాదేశ్ లో 14 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా 16 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఆ రోజే క్విట్ బీజేపీ అనే నినాదాన్ని ఇవ్వాలి: సీపీఐ నారాయణ