హైద్రాబాద్ నగరంలో నకిలీ విసాలు తయారు చేస్తున్న ఏడుగురు ముఠాసభ్యులను ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో నకిలీ వీసాలు తయారు చేస్తూ దందా కొనసాగిస్తున్నారు. నకిలీ వీసాలు తయారు చేసి దుబాయ్, కువైట్ తో పాటు ఇతర దేశాలకు 30 మంది అమాయకులను పంపినట్లు శంషాబాద్ ఎస్వోటీ బృందం గుర్తించింది. ముఠాసభ్యులను అరెస్టు చేసిన ఎస్వోటీ పోలీసులు నిందితుల నుంచి రూ.2 లక్షల నగదు, 16 పాస్పోర్టులు, 13 నకిలీ వీసాలు, 23 స్టాంప్ పేపర్లు స్వాధీనం చేసుకున్నారు.