కమల్ హాసన్, శంకర్ల క్రేజీ కాంబినేషన్లో దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్లో తెరకెక్కుతున్న చిత్రం “భారతీయుడు-2”. 1996లో వచ్చి సంచలనం రేపిన “భారతీయుడు” చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు శంకర్. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. అయితే.. తాజాగా కమల్ హాసన్ హీరోగా ఖైదీ ఫేమ్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు “విక్రమ్” టైటిల్ అనే ఫిక్స్ చేశారు. జనవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. అయితే.. ఈ సినిమాలో విలన్ గా మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ను లోకేశ్ కనగరాజ్ ఎంపిక చేశారని కోలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఫాహద్ నటన తనకు ఇష్టం అని కమల్ గతంలో ఓ సందర్భంలో చెప్పారు. విజయ్ సేతుపతి సూపర్ డీలక్స్, శివకార్తికేయన్ “వేలైక్కారన్” తమిళ సినిమాల్లో ఫాహద్ నటించారు. విక్రమ్కు అనిరుద్ సంగీత అందిస్తున్నారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ కథానాయకుడిగా తెరకెక్కిన మాస్టర్ సినిమా సంక్రాంతికి విడుదలవుతోంది.