ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని కూతురు మర్మాంగాన్ని కోసేసింది. ఈ సంఘటన గుంటూరు జిల్లాలోని తెనాలిలో జరిగింది.
వివరాల్లోకి వెళితే..
బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం తుమ్మలపాలెం గ్రామానికి చెందిన రామచంద్రరెడ్డి 5 ఏళ్ల నుంచి తెనాలిలో నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. ఐతనగర్ కు చెందిన సంధ్యతో గత కొన్ని నెలలుగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది. వీరు ఇరువురు సినిమాలకి వెళ్లి వస్తూ ఉండేవారు. సోమవారం మద్యం సేవించి సంధ్య ఇంటి డాబాపై పడుకొన్నారు.
ఈ క్రమంలోనే తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే విషయం తెలిసి సహించలేక పోయింది. తల్లితో నిద్ర పోతున్న సమయంలో రామచంద్రా రెడ్డిపై యువతి విచక్షణారహితంగా దాడి చేసి.. బ్లేడుతో మర్మాంగాన్ని కోసివేసింది. వెంటనే స్థానికులు స్పందించి రామచంద్ర రెడ్డి కేకలు విని అతణ్ని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.