telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీడీపీకి మరో షాక్.. వైసీపీలో చేరిన మాజీ ఎంపీ

Ex mp harsha kumar joins ycp

సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో టీడీపీకి మరో షాక్ తగిలింది. అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ టీడీపీకీ గుడ్ బై చెప్పారు. గురువారం ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ అధినేత జగన్‌ సమక్షంలో హర్షకుమార్‌, ఆయన కుమారుడు శ్రీహర్ష వైసీపీలో చేరారు. వీరిద్దరకీ కండువా కప్పి పార్టీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు. ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. టీడీపీ నుంచి అమలాపురం సీటును ఆయన ఆశించారు. కానీ, ఆ సీటు దక్కకపోవడంతో హర్షకుమార్ మనస్తాపంతో టీడీపీనీ వీడారు.

Related posts