“క్షణం” సినిమాతో ఊహించని సక్సెస్ ను అందుకున్నాడు హీరో అడివిశేష్. లిమిటెడ్ బడ్జెట్లో రూపొందించిన ఈ సినిమా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఇప్పుడు మరోసారి పివిపి సినిమా, హీరో అడివిశేష్ కాంబినేషన్లో “ఎవరు” అనే థ్రిల్లర్ చిత్రం రూపొందుతోంది. వెంకట్ రామ్ జీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాతలు. ఈ చిత్రంలో అడివిశేష్ హీరోగా నటిస్తుండగా, రెజీనా కసండ్ర హీరోయిన్గా నటిస్తుంది. నవీన్ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రానికి వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇంతకుముందు విడుదల చేసిన ప్రీ లుక్ లో అడివి శేష్ విక్రమ్ వసుదేవ్ బ్యాడ్జ్తో కన్పించాడు. ఇక ఇటీవలే విడుదల చేసిన టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ట్రైలర్ ఆసక్తికరంగా సాగుతోంది. ట్రైలర్ చూస్తుంటే రెజీనా మర్డర్ చేసిందా ? లేక ఆమెపై అత్యాచారం జరిగిందా ? అసలు ఈ హత్యకు మరో మిస్సింగ్ కేసుకు సంబంధమేంటి ? ఈ చిత్రంలో నవీన్ చంద్ర పాత్ర ఏమిటనే విషయాలపై ఆసక్తి నెలకొంది. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.
previous post