telugu navyamedia
తెలంగాణ వార్తలు

హుజూరాబాద్ లో ఈటెల ఘన విజయం..

హుజూరాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేంద‌ర్ భారీ మెజార్టీతో గెలుపొందారు. టీఆర్ ఎస్ అభ్య‌ర్ధి గెల్లు శ్రీనివాస్‌పై 23, 865 ఓట్ల మెజార్టీతో భారీ విజ‌యం సాధించారు. అన్నీ మండ‌లాల్లో ఈటెలేదే పై చేయిగా నిలిచింది. దీంతో 7 సారిగా ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. ఆయ‌న ఏ పార్టీలో ఉన్న స‌రే హుజూరాబాద్ ప్ర‌జ‌లు ఆద‌రించి అత్య‌ధిక మెజార్టీతో గెలిపించారు.

22వ రౌండ్‌లో 1130 ఓట్ల లీడ్‌ను బీజేపీ సాధించింది. 22 రౌండ్లు ముగిసిన తర్వాత 23, 865 ఓట్లు ఆధిక్యంతో ఈటల రాజేందర్‌ భారీ విజయాన్ని సాధించారు. దీంతో హుజూరాబాద్ లో సంబ‌రాలు మొద‌లైయ్యాయి.టీఆర్ ఎస్ ప‌ట్టు ఉన్న గ్రామాల్లో ఈటెల విజ‌యం సాధించారు.

Related posts