తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మహిళలకు స్వేచ్ఛ లభించిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ అభివృద్ధి పనులపై అధికారులతో మంత్రి నేడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి మాట్లాడుతూ ఆడబిడ్డలు నీళ్ల కోసం కష్టాలు పడొద్దని సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. రానున్న మూడు నెలల్లో వర్ధన్నపేటను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
సీఎం కేసీఆర్ సహకారంతో వర్ధన్నపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. ఆడిటోరియం, స్మశానవాటిక, సీసీ రోడ్లు, మోడల్ మార్కెట్, మటన్, చికెన్ షాపులకు ప్రత్యేక భవనాలను నిర్మిస్తామన్నారు.ఈ సమావేశంలో మ్మెల్యే ఆరూరి రమేష్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, కలెక్టర్ హరిత, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు
టీఆర్ఎస్ ట్రిక్స్కు మోసపోయే వారెవరు లేరు: విజయశాంతి