telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

టాస్ ఓడిపోయిన భారత్.. మొదట బ్యాటింగ్ చేయనున్న ఇంగ్లాండ్

నాలుగు టెస్టూల్స్ సిరీస్ లో భాగంగా ఈరోజు భారత్-ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం అయ్యింది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే నాలుగు టెస్టుల ఈ సిరీస్ లో ప్రస్తుతం ఈ రెండు జట్లు ఒక్కో మ్యాచ్ గెలిచాయి. అయితే ఇంతకముందు జరిగిన రెండు మ్యాచ్ లలో టాస్ గెలిచిన జట్టే మ్యాచ్ కూడా గెలిచింది. ఇక ఈ మ్యాచ్ తో భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ తన 100 టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ లో భారత్ మొత్తం ముగ్గురు స్పిన్నర్లు ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగుతుంది. కానీ ఇంగను మాత్రం ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పినర్లతో వస్తుంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది.

ఇంగ్లాండ్ జట్టు : డొమినిక్ సిబ్లీ, జాక్ క్రాలే, జానీ బెయిర్‌స్టో, జో రూట్ (c), బెన్ స్టోక్స్, ఆలీ పోప్, బెన్ ఫోక్స్ (w), జోఫ్రా ఆర్చర్, జాక్ లీచ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్.

భారత జట్టు : రోహిత్ శర్మ, శుబ్‌మాన్‌ గిల్, చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (c), అజింక్య రహానే, రిషబ్ పంత్ (w), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, బుమ్రా

Related posts