జమ్మూకశ్మీర్లోని అవంతిపురా రీజియన్లో మంగళవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదులు ఏ సంస్థకు చెందినవారో తెలియాల్సి ఉంది.
అవంతిపురాలోని సత్పోక్రాన్ ఖ్రేవ్ ఏరియాలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో సీఆర్పీఎఫ్, రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూకశ్మీర్ పోలీసులు కలిసి సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు కాల్పులు జరిగాయి.