telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

కశ్మీర్‌లో కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి

kashmir police firing

జమ్మూకశ్మీర్‌లోని అవంతిపురా రీజియన్‌లో మంగళవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదులు ఏ సంస్థకు చెందినవారో తెలియాల్సి ఉంది.

అవంతిపురాలోని సత్‌పోక్రాన్‌ ఖ్రేవ్‌ ఏరియాలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో సీఆర్పీఎఫ్‌, రాష్ట్రీయ రైఫిల్స్‌, జమ్మూకశ్మీర్‌ పోలీసులు కలిసి సంయుక్తంగా కూంబింగ్‌ నిర్వహించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు కాల్పులు జరిగాయి.

Related posts