telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణ అడవుల్లో కాల్పులమోత.. ఎన్ కౌంటర్ లో మావోయిస్టు మృతి

maoist naksals

గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న తెలంగాణ అడవుల్లో ఒక్కసారిగా కాల్పులమోత మోగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈరోజు పోలీసులు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్ల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. జిల్లాలోని మణగూరు మండలం బుడుగుల అటవీప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు పోలీసులకు నిఘా సమాచారం అందింది. దీంతో జిల్లాలోని బలగాలు కూంబింగ్ ప్రారంభించాయి.

బడుగుల అటవీప్రాంతానికి రాగానే పోలీసులను గమనించిన మావోయిస్టులు విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో గుంటూరు రవి అనే మావోయిస్టు ప్రాణాలు కోల్పోగా, మిగిలినవారు కాల్పులు జరుపుతూ అడవుల్లోకి పారిపోయారు. ఘటనాస్థలి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసులు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్నారు.

Related posts